భారత్ రెండో దశ అణు విద్యుత్ కార్యక్రమంలో సాధించిన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని దేశ అణు శక్తి రంగంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. మూడో దశ అణు ప్రోగ్రామ్కు ఇది బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో థోరియం నిల్వలను సమర్థంగా వినియోగించి దేశానికి ఇంధన భద్రతను సాధించేందుకు ఈ ముందడుగు ఎంతో కీలకమని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఘట్టమని చంద్రబాబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.

భారత అణు ప్రోగ్రామ్ విజయం – గర్వించదగ్గ క్షణం: సీఎం చంద్రబాబు
భారత్ రెండో దశ అణు విద్యుత్ కార్యక్రమంలో సాధించిన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని దేశ అణు శక్తి రంగంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. మూడో దశ అణు ప్రోగ్రామ్కు ఇది బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో థోరియం నిల్వలను సమర్థంగా వినియోగించి దేశానికి ఇంధన భద్రతను సాధించేందుకు ఈ ముందడుగు ఎంతో కీలకమని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఘట్టమని చంద్రబాబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.

