*విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-*
భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం (NARI 2025) గుర్తింపు
పొందిన సందర్భంగా విశాఖపట్నం బీచ్ లో ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి అనిత.
అనంతరం ఏ.యూ. కన్వెన్షన్ హాల్ లో సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి.
మహళల భద్రతతే ఎన్డియే ప్రభుత్వం లక్ష్యం.
సంఘటన జరిగిన వెంటనే శిక్షలు పడుతున్నాయి.
విశాఖ అంటే ఎంతో సుందరమైన నగరం.
విశాఖపట్నం అనునిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది.
విశాఖ రోజురోజుకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది.
అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందడం సంతోషం.
పోలీస్ ఉద్యోగంలో సంతృప్తి చాలా ఎక్కువుగా ఉంటుంది.
శక్తి టీమ్స్,శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం.
శక్తి టీమ్స్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నాయి.
పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
ఎన్డియే ప్రభుత్వంలో ఫోక్సో కేసుల్లో పురోగతి కూడా చూస్తున్నాం.
గంజాయి,డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం.
ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.
మీరు మీ వంతుగా గంజాయి,డ్రగ్స్ పై అవగాహన కల్పించండి.
పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించడం వలన సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
అమ్మకు చెప్పలేనంత పని పిల్లలు చేయకూడదని చాగంటిగారు చెప్పారు.
విశాఖ ప్రగతిని జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విశాఖ పోలీసులను అభినంధించిన హోం మంత్రి అనిత.
నేరస్తులకు తక్కువ సమయంలో శిక్ష పడేలా చేసిన అధికారులను సన్మానించిన హోం మంత్రి అనిత.


