Thursday, 5 February 2026
  • Home  
  • భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని మజ్దూర్ సంఘ్ వినతిపత్రం
- తిరుపతి

భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని మజ్దూర్ సంఘ్ వినతిపత్రం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో గల కార్మిక సంఘ కార్యాలయంలో సోమవారం నాడు ఏపీ కన్స్ట్రక్షన్స్ మజ్దూర్ సంఘ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎస్.సుకుమార్, ప్రధాన కార్యదర్శి సి. ముని కుమార్ లు కార్మిక తనిఖీ అధికారి శ్రీమన్నారాయణకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇచ్చిన హామీల మేరకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చెంగల్ పట్టు ముని కుమార్ మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డును పునరుద్ధరించి భవన నిర్మాణ రంగానికి చెందిన అన్ని విభాగాల కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లుల సొమ్మును వెంటనే విడుదల చేయాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక డైరెక్టర్ పదవిని కార్మికులకు ఇవ్వాలని గత వైసిపి హయాంలో ఇసుక క్వారీలు ఆపేసి కార్మికులకు పనుల్లేకుండా చేశారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తూ గత వైసిపి ప్రభుత్వం 1214 మెమో జారీ చేసిందని, ఫలితంగా లక్షలాది మంది నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికులు ఓట్లు వేసి గెలిపించారని, 16 నెలలవుతున్నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు పునరుద్ధరించి పెండింగ్‌ క్లైములు పరిష్కరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఆచారి, కాలువ ప్రసాద్, రమేష్ ఆచారి, లక్ష్మణ్ రెడ్డి, మురళి, మణి నాయుడు, దొరబాబు, ప్రభు, సీత ముని, వాసు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో గల కార్మిక సంఘ కార్యాలయంలో సోమవారం నాడు ఏపీ కన్స్ట్రక్షన్స్ మజ్దూర్ సంఘ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎస్.సుకుమార్, ప్రధాన కార్యదర్శి సి. ముని కుమార్ లు కార్మిక తనిఖీ అధికారి శ్రీమన్నారాయణకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇచ్చిన హామీల మేరకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చెంగల్ పట్టు ముని కుమార్ మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డును పునరుద్ధరించి భవన నిర్మాణ రంగానికి చెందిన అన్ని విభాగాల కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లుల సొమ్మును వెంటనే విడుదల చేయాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక డైరెక్టర్ పదవిని కార్మికులకు ఇవ్వాలని గత వైసిపి హయాంలో ఇసుక క్వారీలు ఆపేసి కార్మికులకు పనుల్లేకుండా చేశారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తూ గత వైసిపి ప్రభుత్వం 1214 మెమో జారీ చేసిందని, ఫలితంగా లక్షలాది మంది నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికులు ఓట్లు వేసి గెలిపించారని, 16 నెలలవుతున్నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు పునరుద్ధరించి పెండింగ్‌ క్లైములు పరిష్కరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఆచారి, కాలువ ప్రసాద్, రమేష్ ఆచారి, లక్ష్మణ్ రెడ్డి, మురళి, మణి నాయుడు, దొరబాబు, ప్రభు, సీత ముని, వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.