

మానవ వనరుల శాఖ, తెలుగు భాషా ప్రాధికార సంస్థ, నెల్లూరు విక్రమ సింహపురి విశ్వావిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన రెండురోజుల జాతీయ సదస్సులో గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాల తెలుగు విభాగదిపతి భమిడిపాటి గౌరిశంకర్ గౌరవ అతిధిగా పాల్గొని ‘దక్షిణాoధ్రయుగ సాహిత్యం.. తెలుగు పరివ్యాప్తి’ అనే అంశంపై, విక్రమ సింహపురి విశ్వావిద్యాలయ ఆడిటోరియంలో ప్రసంగించారు. ఈ సందర్బంగా భాషా ప్రాధికార సంస్థ సంచాలకులు ఆచార్య మాడ భూషి సంపత్ కుమార్, యోగి వేమన విశ్వావిద్యాలయం ఎన్. ఈశ్వరరెడ్డిలు, గౌరిశంకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గురువారం ఆయనను గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యన్నారాయణ, డా. కె. మార్తాండ కృష్ణ తదితరులు అభినందించారు.

