భద్రాద్రి కలెక్టర్కు జాతీయ స్థాయి అవార్డు
పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్
18 నవంబర్ 2025, భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను, సౌత్ జోన్ 3లో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతిని కూడా అందుకోనున్నారు. తెలంగాణలో ఎంపికైన ఆరు జిల్లాల్లో భద్రాద్రి జిల్లా ఒకటి. భద్రాద్రి జిల్లా కలెక్టర్ కు జాతీయ స్థాయి అవార్డు రావడంతో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.


