శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని స్వామి అమ్మవారి పల్లకి వెంకటసుధీర్రెడ్డి,ఆలయఇ.ఒబాపిరెడ్డి మోయడం జరిగినది. అనంతరం ఎమ్మెల్యే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడి, ఆలయంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, వేచి ఉండే గదుల సౌకర్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భక్తులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. ఆలయంలో చేసిన విద్యుత్ దీపాలంకరణలు, పుష్ప అలంకరణలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా స్వామివారి దర్శనం లభించిందని, క్యూలైన్లలో ఎక్కడా ఇబ్బంది లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించారని భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్ర సందర్శనకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. భక్తుల నుండి వస్తున్న సానుకూల స్పందన తమకు ఎంతో తృప్తినిస్తోందని ఆయన పేర్కొన్నారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా స్వయంగా క్యూలైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని స్వామి అమ్మవారి పల్లకి వెంకటసుధీర్రెడ్డి,ఆలయఇ.ఒబాపిరెడ్డి మోయడం జరిగినది. అనంతరం ఎమ్మెల్యే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడి, ఆలయంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, వేచి ఉండే గదుల సౌకర్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భక్తులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. ఆలయంలో చేసిన విద్యుత్ దీపాలంకరణలు, పుష్ప అలంకరణలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా స్వామివారి దర్శనం లభించిందని, క్యూలైన్లలో ఎక్కడా ఇబ్బంది లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించారని భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్ర సందర్శనకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. భక్తుల నుండి వస్తున్న సానుకూల స్పందన తమకు ఎంతో తృప్తినిస్తోందని ఆయన పేర్కొన్నారు.

