ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలం, పాపా నాయుడు పేట గ్రామంలో వెలసిన శ్రీరాముల వారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి. నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఎస్.సి.వి. నాయుడుకు ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోగినేని భాస్కర్ నాయుడు, మాజీ కౌన్సిలర్ అంజూరు సుధాకర్, కయ్యూరి శివ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో కుంభాభిషేక మహోత్సవం.. అన్నదానంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి.
ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలం, పాపా నాయుడు పేట గ్రామంలో వెలసిన శ్రీరాముల వారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి. నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఎస్.సి.వి. నాయుడుకు ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోగినేని భాస్కర్ నాయుడు, మాజీ కౌన్సిలర్ అంజూరు సుధాకర్, కయ్యూరి శివ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

