Thursday, 31 July 2025
  • Home  
  • బొప్పాయి రైతుల గిట్టుబాటు ధర కోసం రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద, సిఐటియు, ఏపీ రైతు సంఘం ధర్నా !  సబ్ కలెక్టర్ వినతి పత్రం!!
- అన్నమయ్య

బొప్పాయి రైతుల గిట్టుబాటు ధర కోసం రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద, సిఐటియు, ఏపీ రైతు సంఘం ధర్నా !  సబ్ కలెక్టర్ వినతి పత్రం!!

అన్నమయ్య జిల్లా, రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం  బొప్పాయి రైతులు, గిట్టుబాటు ధర కోసం సిఐటియు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, అనంతరం సబ్ కలెక్టర్ వైకోమ్ దేవి మేడం గారికి వినతి పత్రం అందజేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో, దాదాపు 20 వేల ఎకరాల పైగా బొప్పాయి సాగు చేస్తున్నారని, రైతులు ఏడాది పాటు, దుక్కిలు, దున్ని ఎరువులు, వేసి మందులు,కూలీలు, ట్రాన్స్పోర్ట్, ఖర్చులు విపరీతంగా పెరిగాయని, రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటగా రైల్వే కోడూరులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన,  సేటులు, మధ్య దళారులు, సిండికేట్ఐ, రోజురోజుకి ధరలు తగ్గిస్తున్నారు అన్నారు. మొదటిసారి రెండు వారాల క్రితం,  కిలో16 రూపాయలు, ధర పెట్టి, నేడు కిలో 13 రూపాయలు, తగ్గించారని, తిరిగి సోమవారం కూడా ధర తగ్గిస్తున్నారని తెలిపారు. విత్తనం కిలో, నాలుగు లక్షల పెట్టాలని, అందులో నాసిరకం, కల్తీ విత్తనాలు రైతులుకు సరఫరా చేస్తున్నారన్నారు. నర్సరీలో చెట్టు రెండు నెలల తర్వాత, 15 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాలన్నారు.   1000 కేజీలకు, 100 కేజీలు, తరుగు సూట్ పేరుతో, రైతుల నుంచి తీసుకుంటున్నారని,  రైతులను దళారులు మోసం చేస్తున్నారన్నారు. లైసెన్స్ లేకుండా,  కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని,  బొప్పాయి పంటని మార్క్పేడు ద్వారా కొనుగోలు చేసి, కనీసం ధర 25 రూపాయలు నిర్ణయించి కొనుగోలు చేయాలని  డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ గారు స్పందించి, మార్కెటింగ్ అధికారులు, ఆర్టికల్చర్ అధికారులు, ఇండస్ట్రియల్ అధికారులతో, సమావేశమై, రెండు రోజుల్లో విషయం చెబుతానని  హామీఇచ్చారు. నాయకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో బొప్పాయి రైతులు ,  కులమతాలకు, రాజకీయాలకు, అతీతంగా, ఐక్యంగా, ప్రభుత్వం పైన, మధ్య దళాలకు వ్యతిరేకంగా, పోరాటం చేసి, గిట్టుబాటు ధర, సాధించుకోవాలని, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్  రైతు సంఘం (ఏఐకేఎస్), జిల్లా నాయకులు పందికాళ్ళ మణి, రైతు నాయకులు, మద్దిన కోటయ్య నాయుడు. డి, గిరిబాబు రాజు, ముద్దా పెంచల్ రెడ్డి, తుంగా శివకృష్ణ చౌదరి,  మన్నూరు. విశ్వనాథరెడ్డి,  ఈర్ల.ఈశ్వరయ్య, శివారెడ్డి, నాని,  రవిరాజు, వి రాజా, చింజి సుబ్రమణ్యం, కొండల సాయిబాబు,  వై.ఆదినారాయణ, అధిక సంఖ్యలో రైతుల పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా, రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం  బొప్పాయి రైతులు, గిట్టుబాటు ధర కోసం సిఐటియు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, అనంతరం సబ్ కలెక్టర్ వైకోమ్ దేవి మేడం గారికి వినతి పత్రం అందజేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో, దాదాపు 20 వేల ఎకరాల పైగా బొప్పాయి సాగు చేస్తున్నారని, రైతులు ఏడాది పాటు, దుక్కిలు, దున్ని ఎరువులు, వేసి మందులు,కూలీలు, ట్రాన్స్పోర్ట్, ఖర్చులు విపరీతంగా పెరిగాయని, రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటగా రైల్వే కోడూరులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన,  సేటులు, మధ్య దళారులు, సిండికేట్ఐ, రోజురోజుకి ధరలు తగ్గిస్తున్నారు అన్నారు. మొదటిసారి రెండు వారాల క్రితం,  కిలో16 రూపాయలు, ధర పెట్టి, నేడు కిలో 13 రూపాయలు, తగ్గించారని, తిరిగి సోమవారం కూడా ధర తగ్గిస్తున్నారని తెలిపారు. విత్తనం కిలో, నాలుగు లక్షల పెట్టాలని, అందులో నాసిరకం, కల్తీ విత్తనాలు రైతులుకు సరఫరా చేస్తున్నారన్నారు. నర్సరీలో చెట్టు రెండు నెలల తర్వాత, 15 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాలన్నారు.   1000 కేజీలకు, 100 కేజీలు, తరుగు సూట్ పేరుతో, రైతుల నుంచి తీసుకుంటున్నారని,  రైతులను దళారులు మోసం చేస్తున్నారన్నారు. లైసెన్స్ లేకుండా,  కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని,  బొప్పాయి పంటని మార్క్పేడు ద్వారా కొనుగోలు చేసి, కనీసం ధర 25 రూపాయలు నిర్ణయించి కొనుగోలు చేయాలని  డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ గారు స్పందించి, మార్కెటింగ్ అధికారులు, ఆర్టికల్చర్ అధికారులు, ఇండస్ట్రియల్ అధికారులతో, సమావేశమై, రెండు రోజుల్లో విషయం చెబుతానని  హామీఇచ్చారు. నాయకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో బొప్పాయి రైతులు ,  కులమతాలకు, రాజకీయాలకు, అతీతంగా, ఐక్యంగా, ప్రభుత్వం పైన, మధ్య దళాలకు వ్యతిరేకంగా, పోరాటం చేసి, గిట్టుబాటు ధర, సాధించుకోవాలని, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్  రైతు సంఘం (ఏఐకేఎస్), జిల్లా నాయకులు పందికాళ్ళ మణి, రైతు నాయకులు, మద్దిన కోటయ్య నాయుడు. డి, గిరిబాబు రాజు, ముద్దా పెంచల్ రెడ్డి, తుంగా శివకృష్ణ చౌదరి,  మన్నూరు. విశ్వనాథరెడ్డి,  ఈర్ల.ఈశ్వరయ్య, శివారెడ్డి, నాని,  రవిరాజు, వి రాజా, చింజి సుబ్రమణ్యం, కొండల సాయిబాబు,  వై.ఆదినారాయణ, అధిక సంఖ్యలో రైతుల పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.