పున్నమి ప్రతినిధి షేక్.రసూల్ అహమద్ : గత నలభై ఒక్క రోజులుగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వెంకటగిరి పరిసర గ్రామాల్లోని జీవనోపాధి లేని నిరుపేదల ఆకలిని గుర్తించిన శ్రీ పరమేశ్వర వస్త్రాలయం అధినేత,ఘంటసాల కళాక్షేత్రం అధ్యక్షులు, ప్రణతి సంస్థ గౌరవాధ్యక్షులు అయిన బొడిచర్ల సుబ్బయ్య వారి ధర్మపత్ని సరస్వతమ్మ దంపతుల దాతృత్వంతో ప్రణతి సంస్థ ఆధ్వర్యంలో 13వేల రూపాయలు పేదప్రజల భోజనాదులకు కోసం అందించడం జరిగింది. ఈ సందర్బంగా సత్యవాది, గాంధేయవాదులు అయిన బొడిచెర్ల సుబ్బయ్య గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేదవారిని ఆదుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వీయనిర్బంధం, క్రమశిక్షణతో ఉంటూ కరోనాను తరమికొట్టవచ్చునని ఆయన చెప్పారు. ప్రకృతి పరిరక్షణే అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమమైనదని, దీనికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. కరోనా లాంటి మహా విపత్తులోనుంచి బయటపడేందుకు భౌతికదూరంతో పాటు శుచి శుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని సుబ్బయ్యగారు పేర్కొన్నారు. ఈ ఆహార కార్యక్రమ పర్యవేక్షకులుగా ప్రణతి సభ్యులు సుంకర రవికుమార్, చేబ్రోలు రవీంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.
బొడిచెర్ల వారి దాతృత్వం
పున్నమి ప్రతినిధి షేక్.రసూల్ అహమద్ : గత నలభై ఒక్క రోజులుగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వెంకటగిరి పరిసర గ్రామాల్లోని జీవనోపాధి లేని నిరుపేదల ఆకలిని గుర్తించిన శ్రీ పరమేశ్వర వస్త్రాలయం అధినేత,ఘంటసాల కళాక్షేత్రం అధ్యక్షులు, ప్రణతి సంస్థ గౌరవాధ్యక్షులు అయిన బొడిచర్ల సుబ్బయ్య వారి ధర్మపత్ని సరస్వతమ్మ దంపతుల దాతృత్వంతో ప్రణతి సంస్థ ఆధ్వర్యంలో 13వేల రూపాయలు పేదప్రజల భోజనాదులకు కోసం అందించడం జరిగింది. ఈ సందర్బంగా సత్యవాది, గాంధేయవాదులు అయిన బొడిచెర్ల సుబ్బయ్య గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేదవారిని ఆదుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వీయనిర్బంధం, క్రమశిక్షణతో ఉంటూ కరోనాను తరమికొట్టవచ్చునని ఆయన చెప్పారు. ప్రకృతి పరిరక్షణే అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమమైనదని, దీనికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. కరోనా లాంటి మహా విపత్తులోనుంచి బయటపడేందుకు భౌతికదూరంతో పాటు శుచి శుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని సుబ్బయ్యగారు పేర్కొన్నారు. ఈ ఆహార కార్యక్రమ పర్యవేక్షకులుగా ప్రణతి సభ్యులు సుంకర రవికుమార్, చేబ్రోలు రవీంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.

