– మద్దికుంట లో సమీక్ష సమావేశం
కామారెడ్డి, 30 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి :
స్థానిక సంస్థల ఎన్నికల్లో భేషజాలు పక్కన పెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు గట్టి పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కృషి చేయాల ని ఆయన సూచించారు. రామారెడ్డి మండలం లోని మద్దికుంట గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడాతూ, అందరూ పోటీ పడటం మానుకుని, ప్రత్యర్థిపై గెలిచే అవకాశాలు ఉన్న సమర్థులైన అభ్యర్థులను ఎంచుకోవాలన్నారు. వారి గెలుపు కోసం ఏకతాటిపై నిలబడి పనిచేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, బండి ప్రవీణ్, పెండ్యాల నర్సారెడ్డి, దుంపల బాలరాజు, గజ్జల చిన్నరాజు, రేకులపల్లి కిష్టారెడ్డి, కామిల్ల నరేందర్, బండి రవి, దుంపల ప్రేమ్, శ్రీకాంత్, తోటలింగం, భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


