Sunday, 7 December 2025
  • Home  
  • బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు ఆటంకం కలగొద్దు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క.
- నిర్మల్

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు ఆటంకం కలగొద్దు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి) బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల విద్యా బోధనలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పరిస్థితులపై మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ఉన్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా బోధనలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలని, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమన్వయం కలిగి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉత్తమ మౌలిక వసతులతో విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నామన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి)

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల విద్యా బోధనలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క ఆదేశించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పరిస్థితులపై మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ఉన్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా బోధనలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలని, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమన్వయం కలిగి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉత్తమ మౌలిక వసతులతో విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నామన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.