బీహార్ లో ఎన్ డి ఏ కూటమి విజయం.. సంబరాల్లో బిజెపి నాయకులు .
వెల్దండ నవంబర్ 14 :
బీహార్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందున వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు బాణసంచా కాల్చి, స్వీట్లు ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే మండల పరిధిలోని పెద్దాపురం గ్రామంలో మాజీ ఎంపిటిసి పబ్బు చక్రవర్తి గౌడ్, దుగ్గపురం యాదయ్య పులి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బిజెపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్నం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ డబ్బులు ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోరుమిద్దె యాదగిరి, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు జూలూరు బాలస్వామి, గుద్దేటి రామస్వామి, మోహన్ రెడ్డి, రమేష్, వజ్ర లింగం, కానుగుల రవి, కాసోజు పాండు చారి తదితరులు పాల్గొన్నారు.


