పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని, అందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తగిన చొరవ తీసుకోవాలని బిసిఐఎఫ్ రంగా రెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు.. సోమవారం రంగా రెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణతో కూడిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. తొమ్మిదవ షెడ్యూల్ తోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. ఐదు శాతం కూడా లేని అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం గానీ, ఏ చట్టాలు గానీ అడ్డు రాలేదు. జనాభాలో సగంకు పైగా ఉన్న బీసీ, ఏం బీసీ కులాల రిజర్వేషన్లకు మాత్రం అడ్డువస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి లేదని, అందుకు ఉదాహరణ బీసీ బిల్లు ప్రవేశ పెట్టిన విధానమే సరిగా లేదన్నారు. బీసీ లకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టు అడిగితే, సరైన కారణాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవేమీ లేకుండా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు పెట్టడం జరిగిందన్నారు. బీసీ కులాలు దాదాపు 130 వరకు ఉండగా, ఇప్పటికి వందకు పైగా కులాలు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదన్నారు. ఈ వెనుకుబాటును కోర్టులకు చూపించి, వర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చూపిస్తే, కొంత న్యాయం జరిగేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ద్వంద నీతిని పక్కనబెట్టి బీసీ రిజర్వేషన్లు అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో భవిష్యత్తులో అన్ని పార్టీలు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు అనంతుల శ్రీనివాస్, జయంత్, ఏంహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి రాంబాబు, శివ, తదితరులు పాల్గొన్నారు.

* బీసీ బిల్లు తోమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలి —బిసిఐఎఫ్ కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని, అందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తగిన చొరవ తీసుకోవాలని బిసిఐఎఫ్ రంగా రెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు.. సోమవారం రంగా రెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణతో కూడిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. తొమ్మిదవ షెడ్యూల్ తోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. ఐదు శాతం కూడా లేని అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం గానీ, ఏ చట్టాలు గానీ అడ్డు రాలేదు. జనాభాలో సగంకు పైగా ఉన్న బీసీ, ఏం బీసీ కులాల రిజర్వేషన్లకు మాత్రం అడ్డువస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి లేదని, అందుకు ఉదాహరణ బీసీ బిల్లు ప్రవేశ పెట్టిన విధానమే సరిగా లేదన్నారు. బీసీ లకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టు అడిగితే, సరైన కారణాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవేమీ లేకుండా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు పెట్టడం జరిగిందన్నారు. బీసీ కులాలు దాదాపు 130 వరకు ఉండగా, ఇప్పటికి వందకు పైగా కులాలు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదన్నారు. ఈ వెనుకుబాటును కోర్టులకు చూపించి, వర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చూపిస్తే, కొంత న్యాయం జరిగేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ద్వంద నీతిని పక్కనబెట్టి బీసీ రిజర్వేషన్లు అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో భవిష్యత్తులో అన్ని పార్టీలు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు అనంతుల శ్రీనివాస్, జయంత్, ఏంహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి రాంబాబు, శివ, తదితరులు పాల్గొన్నారు.

