శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎల్ఐసి శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో బీమా పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ధ్యేయంగా బుధవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది బీమా ఏజెంట్లు, కార్యాలయ సిబ్బంది, డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ జి. వెంకటేశ్వర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 31తో ముగియనున్న నవజీవన్ శ్రీ పాలసీ గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వివిధ బీమా పథకాలకు సంబంధించిన బ్రోచర్లు, కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ బీమా రక్షణ కలిగి ఉండాలని, ఎల్ఐసి అందించే అద్భుత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ర్యాలీని విజయవంతం చేసిన ఏజెంట్లను, సిబ్బందిని ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ప్రత్యేకంగా అభినందించారు.

బీమాపై అవగాహన కల్పించాలి-శ్రీకాళహస్తిలో ఎల్ఐసి ఏజెంట్ల భారీ ర్యాలీ
శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎల్ఐసి శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో బీమా పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ధ్యేయంగా బుధవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది బీమా ఏజెంట్లు, కార్యాలయ సిబ్బంది, డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ జి. వెంకటేశ్వర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 31తో ముగియనున్న నవజీవన్ శ్రీ పాలసీ గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వివిధ బీమా పథకాలకు సంబంధించిన బ్రోచర్లు, కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ బీమా రక్షణ కలిగి ఉండాలని, ఎల్ఐసి అందించే అద్భుత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ర్యాలీని విజయవంతం చేసిన ఏజెంట్లను, సిబ్బందిని ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ప్రత్యేకంగా అభినందించారు.

