ఖమ్మం పున్నమి ప్రతినిధి
సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలో బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు బానోత్ విజయ్ ఆరోగ్య పరిస్థితిని కేంద్ర హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, దాడికి పాల్పడిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పార్టీ కార్యకర్తలపై ఇలాంటి దాడులను బీజేపీ భరించదని స్పష్టం చేశారు. బానోత్ విజయ్ త్వరగా కోలుకోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.


