పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ని జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సోమవారం నాడు ప్రకటించారు. 20 మంది తో జిల్లా కార్యవర్గ ము ని ప్రకటించగా అందులో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు ఉండటం విశేషం. ఓకే నియోజకవర్గం కి ఇద్దరు ఉపాధ్యక్షులు ని నియమించడం, సీనియర్ లని ప్రక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం పొంగులేటి సుధాకర్ రెడ్డి మద్దత్తు ఉన్న వారికి జిల్లా కార్యవర్గం లో స్థానం ఇచ్చారనే వాదన కి భలం చేకూర్చే విధంగా నూతన జిల్లా కార్యవర్గం ఉందని బీజేపీ సీనియర్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే కార్యవర్గం తో ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ ఒక్క ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించద ని కనీసం నామ మాత్రపు పోటీ కూడా ఇవ్వలేదనే వాదాన కూడా వినిపిస్తుంది.


