భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు, స్థానిక నాయకత్వంలో పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. రాఘవకుప్పం హరీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో రామసేతు బ్రిడ్జి సమీపం, పూసల వీధి, త్రిశూలాంబ గుడి ప్రాంతాల్లో సీనియర్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… జనసంఘ్ నుంచి ప్రారంభమైన బీజేపీ 47 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అంత్యోదయ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, సుపరిపాలన అందించాలనే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. “సేవయే పరమావధి – దేశమే ప్రథమం” అనే నినాదంతో పనిచేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సేవకే అంకితమై నిరంతరం శ్రమిస్తున్న కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు రాఘవ కుప్పం హరీష్ రెడ్డి, సీనియర్ నాయకులు చిలకా రంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా, జిల్లా నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం… శ్రీకాళహస్తిలో ఘనంగా వేడుకలు
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు, స్థానిక నాయకత్వంలో పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. రాఘవకుప్పం హరీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో రామసేతు బ్రిడ్జి సమీపం, పూసల వీధి, త్రిశూలాంబ గుడి ప్రాంతాల్లో సీనియర్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… జనసంఘ్ నుంచి ప్రారంభమైన బీజేపీ 47 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అంత్యోదయ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, సుపరిపాలన అందించాలనే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. “సేవయే పరమావధి – దేశమే ప్రథమం” అనే నినాదంతో పనిచేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సేవకే అంకితమై నిరంతరం శ్రమిస్తున్న కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు రాఘవ కుప్పం హరీష్ రెడ్డి, సీనియర్ నాయకులు చిలకా రంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా, జిల్లా నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

