పున్నమి ప్రతి నిధి
బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించిన స్వచ్ఛంద బంద్ను బిజెపి రూరల్ మండలం అధ్యక్షులు శ్రీ జాటోత్ మధు నాయక్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. మండలంలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బంద్కు సహకరించగా, భాజపా కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి బీసీల హక్కుల కోసం గళమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే బీసీలకు న్యాయం సాధ్యమని నేతలు స్పష్టం చేశారు.


