తొట్టంబేడు, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలం, కంచనపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు శ్రీరాములు రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం కంచనపల్లి చేరుకున్న ఆయన, సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను కలిసి, వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీకి మరియు గ్రామానికి సుధాకర్ రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా బియ్యపు గుర్తుచేసుకున్నారు. సుధాకర్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ కోవి చంద్రయ్య నాయుడు, నాయకులు రవీందర్ నాయుడు, గంగాధరం, భాస్కర్, దాము, కుమారస్వామి నాయుడు, పఠాన్ ఫరీద్, శ్రీవారి సురేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని సుధాకర్ రెడ్డికి కన్నీటి నివాళులు అర్పించారు.

బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డికి ఘన నివాళి
తొట్టంబేడు, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలం, కంచనపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు శ్రీరాములు రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం కంచనపల్లి చేరుకున్న ఆయన, సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను కలిసి, వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీకి మరియు గ్రామానికి సుధాకర్ రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా బియ్యపు గుర్తుచేసుకున్నారు. సుధాకర్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ కోవి చంద్రయ్య నాయుడు, నాయకులు రవీందర్ నాయుడు, గంగాధరం, భాస్కర్, దాము, కుమారస్వామి నాయుడు, పఠాన్ ఫరీద్, శ్రీవారి సురేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని సుధాకర్ రెడ్డికి కన్నీటి నివాళులు అర్పించారు.

