ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయం కోసం ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ప్రవాస్ యోజన పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు వైరా నియోజకవర్గం జూలూరు పాడు లో పాల్గొనగా చిలుకూరు రమేష్, సుదర్శన్ మిశ్రా ఉన్నారు, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మందా సరస్వతి కారే పల్లి మండలం లో సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరావ్ కల్లూరు మండలం లో ఇంకా రాష్ట్ర నాయకులు ఈవి రమేష్, దేవకీ వాసుదేవరావు పలు మండలాల్లో పల్లె నిద్ర కార్యక్రమం లో పాల్గొన్నారు స్థానిక సమస్య లు తెల్సుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తు రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బిజెపి విజయము కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా నేతలు తెలియజేసారు


