పున్నమి ప్రతినిధి, 19 ఫిబ్రవరి రామచంద్రాపురం
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి.రామాపురానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పొన్నా శంకర్ రెడ్డిని ని బిజెపి కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా బుధవారం నియమించారు. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులను అందజేశారు. కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమితులైన శంకర్ రెడ్డి ని పలువురు బిజెపి నాయకులు, కూటమి నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తామని తెలిపారు. నాపై నమ్మకంతో జిల్లా కిషన్ మోర్చా కార్యదర్శి పదవిని ఇచ్చిన పెద్దలకు జిల్లా అధ్యక్షులు సామాంచి శ్రీనివాసులు, చంద్రగిరి నియోజకవర్గ బిజెపి నేత మేడసాని పురుషోత్తం నాయుడు లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులకు అందే విధంగా పనిచేస్తామని తెలిపారు. జిల్లాలో పార్టీ నాయకులు కలుపుకొని పార్టీ బలోపేతానికి పని చేస్తామని చెప్పారు.సుబ్రహ్మణ్యం యాదవ్, దుర్గం ప్రసాద్, దామినేటి శివ, మోహన్ రెడ్డి, బి లక్ష్మణ్ రెడ్డి, తులసి రామ్ రెడ్డి, జగదీష్ రెడ్డి లు పాల్గొన్నారు



