పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 :బిల్డర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరుగుతున్న నేషనల్ మేనేజింగ్ కమిటీ & జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక, నిర్మాణాల నూతన పాలసీలతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర పద్మజ ఫామ్ గ్రోవ్స్ రిసార్ట్ లో కాసేపటి క్రితం ప్రారంభమైంది. హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ అపార్ట్ మెంట్స్, విల్లా ప్రాజెక్టుల నిర్మాణాలు జరుతున్నాయని లక్ష్మారెడ్డి అన్నారు. బిల్డర్స్ అసోషియేషన్ సైతం మహేశ్వరం నియోజకవర్గం ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కాంగ్రెస్ నేత KLR కోరారు. ఈ బిజినెస్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెల బిల్డర్స్ & ప్రతినిధులు పాల్గొన్నారు.


