**బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ టవర్ల ప్రాజెక్టు పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.*
**కొత్త టవర్స్ ఏర్పాట్లలకు స్థల స్థల పరిశీలన పరిశీలన చేయాలి.*
– *జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్*
అల్లూరి డిసెంబర్ 10 విశాఖ పున్నమి ప్రతినిధి:-
ఏ ఎస్ ఆర్ జిల్లా (పాడేరు ) డిసెంబర్ : 09 అల్లూరి జిల్లా ఏజెన్సీ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ టవర్లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశిచారు. మంగళవారం కలెక్టరేట్ విసీ హాల్ నుండి నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్, మండల తాసిల్దార్లు, అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయిన ప్రాంతాల్లో టవర్స్ ఏర్పాటు చేసి 4జి సిగ్నల్స్ అందించాలని ఆదేశించారు.
జిల్లా లో పాడేరు డివిజన్ కు సంబంధించిన bsnl టవర్స్ 561 సెంక్షన్ కాగ 457 పూర్తి కాగ 104 టవర్స్ వివిధ దశలలో ఉన్నదని, రంపచోడవరం డివిజన్ లో బి ఎస్ ఎన్ ఎల్ టవర్స్ 364 సెంక్షన్ అయిందని అందులో 355 పూర్తి చేసామని మిగిలిన 9 టవర్స్ వివిధ దశలలో ఉన్నదని త్వరలో పూర్తి చేస్తామని బి ఎస్ ఎన్ ఎల్ ఏ జి ఏం తెలియజేశారు.
జిల్లాలో అదనంగా 101 బి ఎస్ ఎన్ ఎల్ టవర్స్ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని అందుకు సంబంధించి స్థల పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ మండల తాసిల్దార్ కు ఆదేశించారు.
జిల్లాలో జియో టవర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి 509అనుమతులు పొందగ అందులో 445 టవర్స్ పూర్తి చేసామని, 64 వివిధ దశలలో ఉన్నదని జియో ఏజిఏంతెలియజేశారు.
జిల్లాలో ఎయిర్ టెల్ టవర్స్139 అనుమతులు పొందగా అన్ని పనులు పూర్తి చేసామని ఎయిర్ టెల్ అధికారులు అన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేయు టవర్స్ కు ఆర్ ఓ ఎఫ్ ఆర్ క్లియరెన్స్ అనుమాతలు, పర్మిషన్లు పూర్తి చేసుకుని సిగ్నల్ టవర్స్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రహదారి సదుపాయము లేని (కనెక్టివిటీ) ప్రాంతాలకు టవర్స్ ఏర్పాటుకు సంబంధించిన సామాగ్రిని తరలించుటకు అంతరాయం లేకుండా ప్రత్య న్యాయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ వార్చ్ వాల్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమనికి బిఎస్ఎన్ఎల్ ఏజీఎం శ్రీకాంత్, జిఓ ఏజీఎం సత్యప్రసాద్ ఎయిర్ టెల్ అధికారులు, మండల తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


