వెలుగులతో పాటు సంతోషాలను పంచే పండుగ దీపావళి. ఒక దీపం చీకటిని తరిమేస్తుంది.ఒక జ్ఞానం మనసుని మారుస్తుంది.వెలుగును పంచితే చీకటి తొలుగుతుంది.జ్ఞానంఫ్ పంచితే ప్రపంచం మారుతుంది. దీపావళి పండుగ సందర్భంగా దీపాలతో పూలతో అందమైన రంగవల్లులతో పాఠశాల ప్రాంగణం అంతా అందంగా అలంకరించబడింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. మాధవి లత కరస్పాండెంట్ ఏం రవీంద్రనాథ్ లక్ష్మీ పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రసంగాలు,గీతాలు, నృత్యాలతో పాల్గొని పండుగ వాతావరణం మరింత అందంగా మార్చారు .ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మేడం మాధవి లత మాట్లాడుతూ దీపావళి చెడుపై మంచి సాధించిన విజయమని, విద్యతో అన్ని సాధించవచ్చు అని దుర్మార్గుడైన నరకాసురుడిని తల్లి అయిన భూదేవి సత్యభామ రూపంలో వధించిందని చివరికి అధర్మం పై ధర్మమే విజయం సాధిస్తుందని, ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులను ,సంతోషాలను నింపాలని సందేశం ఇచ్చారు. బాల అకాడమీలో 8వ తరగతి చదువుతున్న బి.సత్య వైష్ణవి వెంకటేశ్వర స్వామి వేషధారణతో వచ్చి అష్ట లక్ష్ములతో కోలాటం చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.

బాల అకాడమీలో- కన్నుల పండుగగా సాగిన దీపావళి పండుగ.
వెలుగులతో పాటు సంతోషాలను పంచే పండుగ దీపావళి. ఒక దీపం చీకటిని తరిమేస్తుంది.ఒక జ్ఞానం మనసుని మారుస్తుంది.వెలుగును పంచితే చీకటి తొలుగుతుంది.జ్ఞానంఫ్ పంచితే ప్రపంచం మారుతుంది. దీపావళి పండుగ సందర్భంగా దీపాలతో పూలతో అందమైన రంగవల్లులతో పాఠశాల ప్రాంగణం అంతా అందంగా అలంకరించబడింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. మాధవి లత కరస్పాండెంట్ ఏం రవీంద్రనాథ్ లక్ష్మీ పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రసంగాలు,గీతాలు, నృత్యాలతో పాల్గొని పండుగ వాతావరణం మరింత అందంగా మార్చారు .ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మేడం మాధవి లత మాట్లాడుతూ దీపావళి చెడుపై మంచి సాధించిన విజయమని, విద్యతో అన్ని సాధించవచ్చు అని దుర్మార్గుడైన నరకాసురుడిని తల్లి అయిన భూదేవి సత్యభామ రూపంలో వధించిందని చివరికి అధర్మం పై ధర్మమే విజయం సాధిస్తుందని, ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులను ,సంతోషాలను నింపాలని సందేశం ఇచ్చారు. బాల అకాడమీలో 8వ తరగతి చదువుతున్న బి.సత్య వైష్ణవి వెంకటేశ్వర స్వామి వేషధారణతో వచ్చి అష్ట లక్ష్ములతో కోలాటం చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.

