Saturday, 14 March 2026
  • Home  
  • బడికి దూరమవుతున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రగతి స్వచ్ఛంద సంస్థ
- తిరుపతి

బడికి దూరమవుతున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రగతి స్వచ్ఛంద సంస్థ

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని వాంపల్లి, పల్లం ఈశ్వరయ్య గిరిజన కాలనీలలో కొద్దిరోజులుగా కొంతమంది విద్యార్థులు బడికి సక్రమంగా పోకుండా ఎలాంటి కారణాలు సమస్యలు లేకున్నా కొంతమంది విద్యార్థులు ఇంటి వద్దనే వృధాగా కాలం గడిపేస్తున్నారని గుర్తించిన ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోతురాజు ఉపాధ్యాయిణీలు ముని లక్ష్మి, రాజారాణి, శిరీష, మల్లేశ్వరి లతో చర్చించి విద్యార్థుల నీవాసలకు వెళ్లి ఇంటింటా బడికి రాని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి తమ పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపాలని పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం పథకం, యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు గురించి వివరించారు. విద్యార్థులకు పాఠశాలల్లో హాజరు సక్రమంగా ఉండాలని తక్కువగా ఉంటే తల్లికి వందనం పథకం రాకుండా పోయే అవకాశం ఉందని ఎక్కువ రోజులు ఇంటి వద్దనే ఉంది కాలక్షేపం చేస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో బాల కార్మికులుగా మారే అవకాశం ఉందని బాల్య వివాహాలు కూడా జరిగే ప్రమాదం ఉందని వారికి తెలిపి బడికి సక్రమంగా పంపించాలని చిన్నారుల తల్లి,దండ్రులకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వారిని ఒప్పించడం జరిగిందని ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని వాంపల్లి, పల్లం ఈశ్వరయ్య గిరిజన కాలనీలలో కొద్దిరోజులుగా కొంతమంది విద్యార్థులు బడికి సక్రమంగా పోకుండా ఎలాంటి కారణాలు సమస్యలు లేకున్నా కొంతమంది విద్యార్థులు ఇంటి వద్దనే వృధాగా కాలం గడిపేస్తున్నారని గుర్తించిన ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోతురాజు ఉపాధ్యాయిణీలు ముని లక్ష్మి, రాజారాణి, శిరీష, మల్లేశ్వరి లతో చర్చించి విద్యార్థుల నీవాసలకు వెళ్లి ఇంటింటా బడికి రాని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి తమ పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపాలని పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం పథకం, యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు గురించి వివరించారు. విద్యార్థులకు పాఠశాలల్లో హాజరు సక్రమంగా ఉండాలని తక్కువగా ఉంటే తల్లికి వందనం పథకం రాకుండా పోయే అవకాశం ఉందని ఎక్కువ రోజులు ఇంటి వద్దనే ఉంది కాలక్షేపం చేస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో బాల కార్మికులుగా మారే అవకాశం ఉందని బాల్య వివాహాలు కూడా జరిగే ప్రమాదం ఉందని వారికి తెలిపి బడికి సక్రమంగా పంపించాలని చిన్నారుల తల్లి,దండ్రులకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వారిని ఒప్పించడం జరిగిందని ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.