Thursday, 5 February 2026
  • Home  
  • బకాయిల చెల్లింపులేని కారణంగా మూడు రోజులుగా నిలిచిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు
- ఆంధ్రప్రదేశ్

బకాయిల చెల్లింపులేని కారణంగా మూడు రోజులుగా నిలిచిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇంకా అందకపోవడంతో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఫలితంగా పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న రోగులు సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సల కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రులకు వెళ్లినా, సేవలు అందక తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు రోగులు ట్రస్టు ఆస్పత్రులు మరియు ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యామ్నాయంగా వైద్యం కోసం క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, తక్షణమే బకాయిలుగా ఉన్న రూ.2700 కోట్లను చెల్లించాలని, ప్యాకేజీ రేట్లను సవరించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి సమస్యను పరిష్కరించకపోతే, సేవల నిలుపుదల కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని, పేదల వైద్యం అడ్డంకులు లేకుండా చూడాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇంకా అందకపోవడంతో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఫలితంగా పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న రోగులు సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సల కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రులకు వెళ్లినా, సేవలు అందక తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు రోగులు ట్రస్టు ఆస్పత్రులు మరియు ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యామ్నాయంగా వైద్యం కోసం క్యూ కడుతున్నారు.
ఆస్పత్రుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, తక్షణమే బకాయిలుగా ఉన్న రూ.2700 కోట్లను చెల్లించాలని, ప్యాకేజీ రేట్లను సవరించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి సమస్యను పరిష్కరించకపోతే, సేవల నిలుపుదల కొనసాగుతుందని వారు హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని, పేదల వైద్యం అడ్డంకులు లేకుండా చూడాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.