*బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు బోట్ అసోసియేషన్ పెద్దలు*
*విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి*
*9 మంది మత్స్యకారులకు పదివేలు(10000/రూ) మరియు 4000 విలువ చేసే నిత్యవసర వస్తువులు పంపిణీ*అదేవిధంగా బోటు యజమానికి 10000 మరియు నిత్యావసర వస్తువుల అందజేసిన ఎమ్మెల్యే మరియు అసోసియేషన్ సభ్యులు*
*మత్స్యకారులను క్షేమంగా వెనక్కి రప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే*
*మత్స్యకారుల విడుదలకు నిరంతరం పర్యవేక్షిస్తున్న అసోసియేషన్ పెద్దలకు మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే*
ఈరోజు ఫిషింగ్ హార్బర్ లో ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు పోషణ నిమిత్తం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు అసోసియేషన్ పెద్దలు శ్రీ లక్ష్మణరావు గారు అప్పారావు గారు సహకారంతో మత్స్యకార కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. 9 మంది మత్స్యకార కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు చ (10000) చొప్పున ,ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మరియు 4000 రూపాయల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు . అదేవిధంగా బోటు యజమానికి 10000 రూపాయలు మరియు నిత్యాసర వస్తువులను అందజేశారు .కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 9 మంది మత్స్యకారులను క్షేమంగా వెనక్కి రప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని తెలియజేశారు. మత్స్యకార కుటుంబీకులు అపోహలకు పోకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు. బంగ్లాదేశ్ మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్న ఇటీవల సంఘటన నేపథ్యంలో మత్స్యకారుల విడుదలకు కొంత ఆలస్యం అయిందని అతి త్వరలో వారిని వెనక్కి రప్పించే బాధ్యత కేంద్ర మంత్రి, విశాఖ ఎంపీ భరత్ గారు, విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యేలను నిరంతరం పర్యవేస్తున్నామని తెలియజేశారు. మత్స్యకారులకు తాము అండగా ఉన్నామని వారి కుటుంబ సభ్యులు అధైర్య పడకూడదని ఎమ్మెల్యే వంశీ గారు తెలిపారు . మత్స్యకారుల కుటుంబ సభ్యుల పోషణ నిమిత్తం ప్రభుత్వానికి కూడా 20000 రూపాయలు ఇవ్వాలని తాము నివేదించానని వివరించారు .కార్యక్రమంలో బోటు అసోసియేషన్ పెద్దలు కూటమి శ్రేణులు పాల్గొన్నారు….


