— పున్నమి ప్రతినిధి
బంగ్లాదేశ్ ప్రస్తుతం చాలా సున్నితమైన, ప్రమాదకర దశలో ఉందని భారత మాజీ దౌత్యవేత్త అనిల్ త్రిగుణాయత్ హెచ్చరించారు. మైనారిటీలకు తక్షణ రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను పునరుద్ధరించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న జరగనున్న పారదర్శక ఎన్నికలు దేశాన్ని స్థిరీకరించేందుకు, ప్రజాస్వామ్య పరివర్తనను సజావుగా కొనసాగించేందుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు


