పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగరెడ్డి జిల్లా
తెలంగాణ ఇంచార్జ్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంక్షలు*
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16.02.2026న జరగనున్న మున్సిపాలిటీల చైర్పర్సన్ మరియు వైస్-చైర్పర్సన్ పరోక్ష ఎన్నికల కోసం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటం కోసం పోలీస్ కమిషనర్ . సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమైన ఆదేశాలు:
గుమికూడటంపై నిషేధం 3 మందికి పైగా వ్యక్తులు ఒకచోట చేరకూడదు. ఎన్నికల కోడ్ (MCC) అమలులో ఉన్నందున, అనుమతి లేని సమావేశాలు లేదా ర్యాలీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈ ఆంక్షలు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద విధించబడ్డాయి.
ఈ ఆదేశాలు 16 ఫిబ్రవరి 2026న అమలులో ఉంటాయి.
ఆంక్షలు వర్తించే ప్రాంతాలు:
ఇబ్రహీంపట్నం,షాద్నగర్,శంకర్పల్లి,మొయినాబాద్, ఆమనగల్.



