పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 06 (పున్నమి ప్రతినిధి): ప్రైవేటు సంభాషణను బహిర్గతం చేయడం అనైతికమని, దీనిపై పోలీసులను ఆశ్రయిస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండుబోగుల నాగు అన్నారు. స్థానిక జువ్వలపాలెం లోని ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత రెండున్నర దశాబ్దాలుగా సన్నిహిత పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి మాట్లాడించడంతో తాను మాట్లాడటం జరిగిందన్నారు. ఎంతో నమ్మకంతో ప్రైవేట్ సంభాషణ గా మాట్లాడిన మాటలను బయటకు వైరల్ చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. నమ్మకంతో మాట్లాడించి ఆ మాటలను ఇలా బయట పెట్టడం అనైతిక చర్య అని నాగు పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తాడేపల్లిగూడెం రాజకీయాలలో కొనసాగుతున్న తాను ఒకవేళ ఏదైనా విషయం చెప్పాలంటే బహిరంగంగానే మీడియాను పిలిచి మరి చెబుతానని స్పష్టం చేశారు. అంతేగాని ఇలా రహస్యంగా మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. తనను కావాలని అప్రతిష్ట పాలు చేయడానికి రాజకీయంగా దెబ్బ తీయటానికి ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగినట్లు తాను భావిస్తున్నాను అన్నారు. దీని వెనుక రాజకీయ కోణంలో కుట్ర దాగి ఉంటుందని అనుమానం వ్యక్తం అవుతుంది అన్నారు. ఇక ఎవరితోనూ ఫోన్లో ప్రైవేటుగా మాట్లాడకూడదని విషయం స్పష్టమవుతుందన్నారు. ఈ కారణంగానే పట్టణ పోలీసు అధికారి కి తాను ఫోనులో విషయం తెలియజేయగా ఆయన విషయాలు ఫోన్ లో చెప్పమని కోరిన తాను స్వయంగా వచ్చి చెబుతానని అన్నాను తప్ప ఫోన్లో చెప్పలేదు అన్నారు. జరిగిన దానిపై పోలీసులను ఆశ్రయించి ఏ విధంగా ముందుకు వెళ్లాలని దానిపై ఆలోచన చేస్తానన్నారు ఇలా ప్రైవేటు సంభాషణలను బహిర్గతం చేయడం చాలా దారుణమని ఖండించారు. ఎంతో నమ్మబలికి ఓపెన్ గా మాట్లాడించడం ఆ తర్వాత ఆ మాటలను ఇలా బహిర్గతం చేయడం నైతికత కాదన్నారు. ఇది ఒక వ్యక్తి ప్రైవసీ కి భంగం కలిగించడమే అన్నారు. తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించిన ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన అవకాశాలు ఉపయోగించుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని వైసిపి సీనియర్ నాయకులు గుండుబోగుల నాగు తెలియజేశారు.

ప్రైవేట్ సంభాషణను బహిర్గతం చేయడం అనైతికం పోలీసులను ఆశ్రయిస్తా : వైసిపి నాయకుడు గుండుబోగుల నాగు
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 06 (పున్నమి ప్రతినిధి): ప్రైవేటు సంభాషణను బహిర్గతం చేయడం అనైతికమని, దీనిపై పోలీసులను ఆశ్రయిస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండుబోగుల నాగు అన్నారు. స్థానిక జువ్వలపాలెం లోని ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత రెండున్నర దశాబ్దాలుగా సన్నిహిత పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి మాట్లాడించడంతో తాను మాట్లాడటం జరిగిందన్నారు. ఎంతో నమ్మకంతో ప్రైవేట్ సంభాషణ గా మాట్లాడిన మాటలను బయటకు వైరల్ చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. నమ్మకంతో మాట్లాడించి ఆ మాటలను ఇలా బయట పెట్టడం అనైతిక చర్య అని నాగు పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తాడేపల్లిగూడెం రాజకీయాలలో కొనసాగుతున్న తాను ఒకవేళ ఏదైనా విషయం చెప్పాలంటే బహిరంగంగానే మీడియాను పిలిచి మరి చెబుతానని స్పష్టం చేశారు. అంతేగాని ఇలా రహస్యంగా మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. తనను కావాలని అప్రతిష్ట పాలు చేయడానికి రాజకీయంగా దెబ్బ తీయటానికి ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగినట్లు తాను భావిస్తున్నాను అన్నారు. దీని వెనుక రాజకీయ కోణంలో కుట్ర దాగి ఉంటుందని అనుమానం వ్యక్తం అవుతుంది అన్నారు. ఇక ఎవరితోనూ ఫోన్లో ప్రైవేటుగా మాట్లాడకూడదని విషయం స్పష్టమవుతుందన్నారు. ఈ కారణంగానే పట్టణ పోలీసు అధికారి కి తాను ఫోనులో విషయం తెలియజేయగా ఆయన విషయాలు ఫోన్ లో చెప్పమని కోరిన తాను స్వయంగా వచ్చి చెబుతానని అన్నాను తప్ప ఫోన్లో చెప్పలేదు అన్నారు. జరిగిన దానిపై పోలీసులను ఆశ్రయించి ఏ విధంగా ముందుకు వెళ్లాలని దానిపై ఆలోచన చేస్తానన్నారు ఇలా ప్రైవేటు సంభాషణలను బహిర్గతం చేయడం చాలా దారుణమని ఖండించారు. ఎంతో నమ్మబలికి ఓపెన్ గా మాట్లాడించడం ఆ తర్వాత ఆ మాటలను ఇలా బహిర్గతం చేయడం నైతికత కాదన్నారు. ఇది ఒక వ్యక్తి ప్రైవసీ కి భంగం కలిగించడమే అన్నారు. తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించిన ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన అవకాశాలు ఉపయోగించుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని వైసిపి సీనియర్ నాయకులు గుండుబోగుల నాగు తెలియజేశారు.

