పున్నమి ప్రతినిధి
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రము లో ప్రైవేటు విద్యా సంస్థ ల యాజమాన్యం నిర్వహించ తలపెట్టిన బంద్ రద్దు అయిందని తెలంగాణ ప్రైవేటు యాజమాన్య అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు తెలియజేసారు. సోమవారం తెలంగాణ ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్రమార్క తో జరిగిన చర్చలు సఫలం అవ్వడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలియజేశారు. బాకీ ఉన్న మొత్తం 1200 కోట్లకు గాను ఒక వారం లో 600 కోట్లు అలాగే మిగిలిన 600 కోట్లు దీపావళి కీ ఇచ్చే విధంగా ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్రమార్క హామీ ఇచ్చిన నేపథ్యంలో బంద్ ని విరమించుకుంటున్నట్లు
వారు తెలియజేశారు


