ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అరకులోయ మండలం పెదలబుడు పంచాయతి లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను నిర్మిస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం దారుణమని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరమైతే పేద, మధ్యతరగతి వారు వైద్య విద్యకు దూరమవుతారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి వారు తీసుకున్న నిర్ణయం ఏ స్థాయిలో ఉన్నదని తెలియజేయడానికే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రైవేటీకరణతో వైద్య విద్య అందని ద్రాక్ష : అరకు ఎమ్మేల్యే
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అరకులోయ మండలం పెదలబుడు పంచాయతి లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను నిర్మిస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం దారుణమని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరమైతే పేద, మధ్యతరగతి వారు వైద్య విద్యకు దూరమవుతారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి వారు తీసుకున్న నిర్ణయం ఏ స్థాయిలో ఉన్నదని తెలియజేయడానికే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

