ప్రాథమిక పాఠశాల చుట్టుపక్కల పరిస్థితుల మీద పర్యవేక్షించిన బిజెపి నాయకులు
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు కొత్త బజారులోని 2 వార్డులో గల మండల ప్రాధమిక పాఠశాల చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మీద ప్రజలనుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యవేక్షించడం జరిగింది.అక్కడ స్కూల్ బయట ఉన్న దుస్థితి పందులకు,ఎనుములకు స్వర్గధామంగా ఉన్నట్లుంది .ఇక అసలు విషయానికొస్తే మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేయడానికి సంస్థాగతంగా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తుంటే క్రింది స్తాయి అధికారుల అలసత్వంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి పిల్లలకు శాపంగా మారుతోంది.ఈ సమస్యలను పరిష్కరించాలని సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్, రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ కన్వీనర్ తోట శ్రీనివాసులు మరియు కిసాన్ మోర్చా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ వర్మ , వీహెచ్ పి దరిశ వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కుప్పాల కిరణ్ , మండల ఆఫీస్ సెక్రటరీ అందరివాడు సుబ్బారావు, మహిళా నాయకురాలు కుప్పాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


