– ప్రశ్నిస్తే చంపేస్తారా
– బీసీ నాయకుడు విజయ్ భాస్కర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
– విశాఖ వైసీపీ జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్
*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- *
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబియాల విజయభాస్కర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు రవీంద్ర భరత్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీలపైన అనేక దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపకపోగా దాడులకి ప్రోత్సహించడం ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు బీసీలు నోరెత్తకూడదు అనే విధంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, చంపేస్తాం అని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా రాష్ట్రంలో బీసీలను అనగ తొక్కాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రానున్న రోజుల్లో తిప్పికొడతామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం గళం వినిపిస్తూ ఉంటామని, ప్రభుత్వం ఇటువంటి పిరికి చర్యలు మానుకోవాలని హితవు పలికారు ఇటువంటి చర్యలు ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఉదాహరణగా చెప్పొచ్చని భావించారు, కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ఎవరు ప్రశ్నించినా ప్రచారం చేసిన వారిని టార్గెట్ చేసి ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం బీసీ అధ్యక్షులు బోండాడ వెంకటరమణ, 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి కంటుముచ్చు సాగర్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ బెవర మహేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ చోడిపల్లి శివ, 37వ వార్డు ఇన్చార్జి గనగళ్ళ రామరాజు, దక్షిణ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు ఆకుల శ్యామ్, 38వ వార్డు యువజన అధ్యక్షులు చాపల నూకరాజు, యలమంచిలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు


