-కొత్త మంగంపేటలో నాగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం – భరోసా కల్పించిన సంఘ సభ్యులు
చిట్వేల్, నవంబర్ 12: పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం, కొత్త మంగంపేట గ్రామంలో ప్రమాదానికి గురై ఇబ్బందులు పడుతున్న ఒక నిరుపేద కుటుంబానికి శాలివాహన సంఘం మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది.
-ప్రమాద వివరాలు:
గ్రామానికి చెందిన గొట్టం నాగయ్య అనే వ్యక్తి గత పది రోజుల క్రితం రేషన్ బియ్యం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. ఈ ఘటనలో అతనికి ఎముక విరిగింది . దీంతో నాగయ్య కుటుంబం వైద్య చికిత్స కోసం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
-సంఘం భరోసా:
ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాలివాహన సంఘం సభ్యులు తక్షణమే స్పందించారు. సంఘం నాయకులు మరియు సభ్యులు కలిసి నాగయ్య ఇంటికి వెళ్లి, వారికి ఆర్థిక సహాయం అందించారు.”కష్టాల్లో ఉన్నప్పుడు మేము మీకు అండగా ఉంటాము. ధైర్యం కోల్పోవద్దు,” అని భరోసా కల్పించారు. సంఘం చేసిన ఈ సహాయం పట్ల నాగయ్య కుటుంబ సభ్యులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమ సాటి వ్యక్తికి ఆపన్న హస్తం అందించిన శాలివాహన సంఘం సేవానిరతిని గ్రామస్తులు ప్రశంసించారు.


