ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 5 (పున్నమి ప్రతినిధి) మల్లి.మనుబోలు మండలం లక్ష్మీనరసింహాపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు భోజనం, పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య: ఎంఈఓ రమేష్ కుమార్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 5 (పున్నమి ప్రతినిధి) మల్లి.మనుబోలు మండలం లక్ష్మీనరసింహాపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు భోజనం, పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

