– ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోడాక్టర్ సురేష్ బాబు ఆద్వర్యాంలో ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ సురేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సంద ర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ, ఆయుర్వేద మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించి తమ ఆరోగ్యా న్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసు పత్రిలోనే ఆయుర్వేద మందులు అందుబా టులో ఉన్నాయని చెప్పారు.మండల ప్రజలు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్య క్రమం అనంతరం, ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వ హించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, డాక్టర్ సురేఖ, రమ్య, జానకమ్మ, పవన్, శ్రీధర్, రాజు, కవితతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు


