శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి, వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ప్రతి విన్నపాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పించేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రధాన ధ్యేయమన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి, వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ప్రతి విన్నపాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పించేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

