పెదవేగి, సెప్టెంబర్ 11:
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాలపై పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు.
ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ,
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. వేగం వద్దు, ప్రాణం ముద్దు అని, ప్రపంచానికి నువ్వు ఒక్కడివే కాకపోయినా, నీ ఇంటికి నువ్వే పెద్ద దిక్కు అనే భావన ప్రతి వాహనదారులు గుర్తుంచుకోవాలని సూచించారు. వాహనదారులు సరైన ధ్రువ పత్రాలు లేని వాహనదాలపై జరిమానాలు విధించారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి
పెదవేగి, సెప్టెంబర్ 11: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాలపై పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. వేగం వద్దు, ప్రాణం ముద్దు అని, ప్రపంచానికి నువ్వు ఒక్కడివే కాకపోయినా, నీ ఇంటికి నువ్వే పెద్ద దిక్కు అనే భావన ప్రతి వాహనదారులు గుర్తుంచుకోవాలని సూచించారు. వాహనదారులు సరైన ధ్రువ పత్రాలు లేని వాహనదాలపై జరిమానాలు విధించారు.

