శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా విఎంసి సర్కిల్ వద్ద ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకులు లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతిలో బిజెపి కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమం కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే కాదని, పార్టీ సిద్ధాంతాలను సామాన్యుడికి చేరవేసే ఒక గొప్ప యజ్ఞమని ఆయన అభివర్ణించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలని, గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నేతలు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల బిజెపి నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, యువకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగరాలి-బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా పిలుపు
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా విఎంసి సర్కిల్ వద్ద ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకులు లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతిలో బిజెపి కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమం కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే కాదని, పార్టీ సిద్ధాంతాలను సామాన్యుడికి చేరవేసే ఒక గొప్ప యజ్ఞమని ఆయన అభివర్ణించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలని, గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నేతలు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల బిజెపి నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, యువకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

