ఖమ్మం అక్టోబర్
( పున్నమి ప్రతినిధి)
ప్రజా సమస్య ల పరిష్కారమే ద్యేయం గా ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ ఖమ్మం రెండవ పట్టణ పరిధిలో గల ప్రతి డివిజన్లో, పోలింగ్ బూత్ అధ్యక్షులను కలిసి వారి పోలింగ్ బూత్ లో ఆ డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా మొదటిరోజు పర్యటన రెండవ పట్టణ పరిధిలో ఉన్న 10వ డివిజన్లో ఉన్నటువంటి రాములవారి దర్శనం అనంతరం వారి ఆశీస్సులతో 10 &11 డివిజన్లో మొదలుపెట్టారు, పది రోజులు సుమారు ఈ పర్యటన ఉంటుందని తమ దృష్టికి వచ్చిన సమస్య ల పరిష్కారం కోసం అవసరం అయితే పెద్ద ఎత్తున ధర్నా లు, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అని వెంకట్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పదవ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి యుగంధర్ నాయుడు,11వ డివిజన్, శ్రీనివాస చార్యులు,మరియు, రుద్ర గాని మాధవ్, కన్నెగంటి కృష్ణ చారి, వేల్పుల సుధాకర్, మహేందర్,భూక్య వెంకట్ దాసరి వీరభద్రం, పోలింగ్ బూత్ అధ్యక్షులు, శేఖర్, అయ్యప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


