అనకాపల్లి జిల్లా జనవరి 31 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నిర్ణీత తేదీకి ఒకరోజు ముందుగానే ఏటికొప్పాక గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, విధవులు వంటి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ప్రజల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది.



