నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి)
ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దు అని అన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు. ఈ సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు రాగా, 73 ఫిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు వచ్చాయి. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ వర్షం కారణంగా గ్రామాలలో నీరు నిలువ లేకుండా చూడాలని, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా పూర్తిగా శానిటేషన్ చేయాలని చెప్పారు.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన : కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి) ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దు అని అన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు. ఈ సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు రాగా, 73 ఫిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు వచ్చాయి. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ వర్షం కారణంగా గ్రామాలలో నీరు నిలువ లేకుండా చూడాలని, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా పూర్తిగా శానిటేషన్ చేయాలని చెప్పారు.

