అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి
వినాయక చవితి సందర్భంగా బుధవారం రాజంపేట కూచివారిపల్లి పంచాయితీ ఎన్టీఆర్ కాలనీలో చమ్మర్తి అభిమాని హరి ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమంలో రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. ఆయన స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరికీ శుభం కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.


