Sunday, 7 December 2025
  • Home  
  • ప్రజలను తప్పుదోవ పట్టించేపని వైకాపా నాయకులదే…ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

ప్రజలను తప్పుదోవ పట్టించేపని వైకాపా నాయకులదే…ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నాడు స్థానిక శ్యాసన సభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సమక్షంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి మాట్లాడుతూ…గతనాలుగు రోజులకు పడుతున్న వర్షాలతో ప్రజలు కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించే దిశగా అధికారులతో కార్యాచరణ చేపట్టామని ఇక వైకాపా నాయకులు వారి స్వార్థాల కోసం అసత్యపు ప్రచారాలు చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టించేపనికి పూనుకున్నారని శ్రీకాళహస్తిలో కుంభ వర్షం పడడంతో వర్షం పడేటప్పుడు కావాలనే వైకాపా వారు ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం మానుకోవాలని వైకాపా నాయకులకు ఆయన హితు పలికారు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పట్టణంలోని మురుగు కాలువల్లో పూడికలు తీయించి అదేవిధంగా వర్షపాతం అధికంగా పడితే ప్రజలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. తద్వారా శ్రీకాళహస్తిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలు సుఖంగా ఉన్నారని అయితే వైకాపా నాయకులు తాము సోషల్ మీడియాలో, పేపర్లో రావాలని జిజ్ఞాసతో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని వైకాపా నాయకులకు తెలియజేశారు. ఎవరు ఎన్ని చెప్పినా తాను నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తాను చేస్తున్నానని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలకు తనకు ఈ వర్షాలలో ప్రజల వద్ద నుంచి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అయితే వీటిని వైకాపా నాయకులు తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మరని వర్షపాతం వల్ల రైతులకు ఎటువంటి నష్టం జరిగిందో అధికారులతో సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. అధికారులు ఇచ్చిన నివేదికను సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని అదే విధంగా రైతులకు యూరియా కార్డులుపంపిణీ చేసి ప్రభుత్వం ఇస్తున్న యూరియాను, క్రిమిసంహారక మందులను అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని రైతులకు వారికి కావలసినంత యూరియా ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి, కంటా రమేష్, కాసరo రమేష్, చెంచయ్య నాయుడు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నాడు స్థానిక శ్యాసన సభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సమక్షంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి మాట్లాడుతూ…గతనాలుగు రోజులకు పడుతున్న వర్షాలతో ప్రజలు కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించే దిశగా అధికారులతో కార్యాచరణ చేపట్టామని ఇక వైకాపా నాయకులు వారి స్వార్థాల కోసం అసత్యపు ప్రచారాలు చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టించేపనికి పూనుకున్నారని శ్రీకాళహస్తిలో కుంభ వర్షం పడడంతో వర్షం పడేటప్పుడు కావాలనే వైకాపా వారు ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం మానుకోవాలని వైకాపా నాయకులకు ఆయన హితు పలికారు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పట్టణంలోని మురుగు కాలువల్లో పూడికలు తీయించి అదేవిధంగా వర్షపాతం అధికంగా పడితే ప్రజలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. తద్వారా శ్రీకాళహస్తిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలు సుఖంగా ఉన్నారని అయితే వైకాపా నాయకులు తాము సోషల్ మీడియాలో, పేపర్లో రావాలని జిజ్ఞాసతో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని వైకాపా నాయకులకు తెలియజేశారు. ఎవరు ఎన్ని చెప్పినా తాను నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తాను చేస్తున్నానని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలకు తనకు ఈ వర్షాలలో ప్రజల వద్ద నుంచి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అయితే వీటిని వైకాపా నాయకులు తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మరని వర్షపాతం వల్ల రైతులకు ఎటువంటి నష్టం జరిగిందో అధికారులతో సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. అధికారులు ఇచ్చిన నివేదికను సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని అదే విధంగా రైతులకు యూరియా కార్డులుపంపిణీ చేసి ప్రభుత్వం ఇస్తున్న యూరియాను, క్రిమిసంహారక మందులను అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని రైతులకు వారికి కావలసినంత యూరియా ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి, కంటా రమేష్, కాసరo రమేష్, చెంచయ్య నాయుడు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.