
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం: మోర్త సత్తిబాబు
కోనసీమ: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని అంబాజీపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోర్త సత్తిబాబు అన్నారు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో భర్త చనిపోయిన 11 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కూటమి మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.


