ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు పని చేయాలి: ఎంపీడీవో కృష్ణ

0
155

టంగుటూరు మండల కేంద్రమైన టంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో 18 పంచాయతీల కార్యదర్శులు ఈవో ఆర్ డి బ్రహ్మయ్యలకు ఎంపీడీవో సూచనలు ఇచ్చారు. గ్రామాలలో స్పందన కార్యక్రమం చేపట్టాలని రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు సంబంధించిన వారికి జియో టాక్ నిర్వహించాలని అదేవిధంగా సర్వీస్ డెలివరీలు చేయాలని, ప్రజలకు అందించే 227 సర్వీసులు గ్రామ సచివాలయం లోనే అందిస్తారని, కావున ప్రజలు గ్రామ సచివాలయంలోనే సంక్షేమ ఫలాలు అధికారులకు సూచనలు ఇచ్చారు. ఏ సంక్షేమ పథకం అయినా నా సచివాలయంలోని అధికారులతో సమన్వయ పరుచుకుని తమ గ్రామ సచివాలయంలోనే అర్జీలు గాని ఎటువంటి సంక్షేమ పథకమైనా గ్రామ వాలంటరీ సచివాలయ వ్యవస్థ తోనే ప్రజలు సంక్షేమ పథకాలు అందించాలని కార్యదర్శులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 18 పంచాయతీ కార్యదర్శులు, ఈవో ఆర్ డి పంచాయతీ సిబ్బంది, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

0
0