శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరి గ్రామంలో తేజోరస సంస్థ ఆధ్వర్యంలో ఆహారోగ్యం పేరుతో గ్రామ ప్రజలకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని మాట్లాడారు. మన సమాజం సాంకేతికంగా ఎదుగుతున్నప్పటికీ,ఆరోగ్య పరంగా మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.చిన్న వయసులోనే ఆహారోగ్యం ఉత్పత్తులను ప్రారంభించి, ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న కీర్తి ని వారు అభినందించారు.ఇలాంటి యువత సమాజానికి మార్గదర్శకులు కావాలి అని అన్నారు.అనంతరం చంద్రప్పను తేజోరస సంస్థ వారు సన్మానించారు.

ప్రకృతి సిద్ధమైన ఆహారమే ఆరోగ్యానికి పునాది:బీజేపీ నేత డా.చంద్రప్ప
శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరి గ్రామంలో తేజోరస సంస్థ ఆధ్వర్యంలో ఆహారోగ్యం పేరుతో గ్రామ ప్రజలకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని మాట్లాడారు. మన సమాజం సాంకేతికంగా ఎదుగుతున్నప్పటికీ,ఆరోగ్య పరంగా మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.చిన్న వయసులోనే ఆహారోగ్యం ఉత్పత్తులను ప్రారంభించి, ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న కీర్తి ని వారు అభినందించారు.ఇలాంటి యువత సమాజానికి మార్గదర్శకులు కావాలి అని అన్నారు.అనంతరం చంద్రప్పను తేజోరస సంస్థ వారు సన్మానించారు.

