శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తిలో భూ అమృత్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఏఎస్ అధికారి ఏపీఎస్ సిడిఎల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ శివశంకర్, రాష్ట్ర అటవీ శాఖ సలహాదారు అంకారావు, మాజీ శాసనసభ్యులు ఎస్ సీ వి నాయుడు హాజరయ్యారు. గ్రామీణ శాస్త్రవేత్తలు చంద్రశేఖర్ నాయుడు, హరిబాబు నాయుడు బృందం ఆధ్వర్యంలో భూ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, ఔషధ మొక్కల పై అవగాహన సమావేశం జరిపారు. ఈ సందర్బంగా ఎస్ సి వి నాయుడు మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రకృతి సంపద ఏ ఒక్కరి సొంతం కాదనేది పరమేశ్వరుడు తెలియజేశారని వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో విషతుల్యం కానీ ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవాలని బావి తరాలకు ప్రకృతి సంపదలు అందించాలన్నారు. అనంతరం రాష్ట్ర అటవీశాఖ సలహాదారు అంకారావు మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో చేపట్టిన గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిలో వివిధ రకాల మొక్కల ఆవశ్యకత, వాటిలో ఉన్న ఔషధ గుణాలను వివరించారు. ప్రతి ఇంటిలో లోపల తులసి వెలుపల వేపచెట్టు ఉండాలని, ఊరిలో రావి చెట్టు, ఊరి వెలుపల మరి చెట్టు ఉండాలన్నారు. పంచభూతాలను కలుషితం చేస్తే సమాజం నష్టపోతుందని, ప్రకృతిని కాపాడుకుంటూ మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు. కలుపు మొక్క వయ్యారి బొమ్మ ఎలా నివారించాలో వివరించారు. గ్రామీణ పరిశోధకులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఐఏఎస్ అధికారి తిరుపతి ఏపీఎస్ డిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి అంటే ప్రకృతి సంపద భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని సంపదంటే ఆరోగ్యమేని ఆ ఆరోగ్యం కాపాడుకోవాలంటే కలుషితం లేని ఆహారం కావాలంటే భూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతుల లో మార్పు కోసం ప్రయత్నించాలన్నారు. గ్రామీణ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేయాలని అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను గ్రామీణ శాస్త్రవేత్తల బృందం, ఎస్ సి వి దిలీప్, స్థానిక రైతు నాయకులు ఘనంగా సత్కరించారు.

ప్రకృతి వ్యవసాయంతో ఆహారా విషతుల్యతను అరికడదాం.. మాజీ ఏమ్మెల్యే యస్.స్సీ.వి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తిలో భూ అమృత్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఏఎస్ అధికారి ఏపీఎస్ సిడిఎల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ శివశంకర్, రాష్ట్ర అటవీ శాఖ సలహాదారు అంకారావు, మాజీ శాసనసభ్యులు ఎస్ సీ వి నాయుడు హాజరయ్యారు. గ్రామీణ శాస్త్రవేత్తలు చంద్రశేఖర్ నాయుడు, హరిబాబు నాయుడు బృందం ఆధ్వర్యంలో భూ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, ఔషధ మొక్కల పై అవగాహన సమావేశం జరిపారు. ఈ సందర్బంగా ఎస్ సి వి నాయుడు మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రకృతి సంపద ఏ ఒక్కరి సొంతం కాదనేది పరమేశ్వరుడు తెలియజేశారని వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో విషతుల్యం కానీ ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవాలని బావి తరాలకు ప్రకృతి సంపదలు అందించాలన్నారు. అనంతరం రాష్ట్ర అటవీశాఖ సలహాదారు అంకారావు మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో చేపట్టిన గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిలో వివిధ రకాల మొక్కల ఆవశ్యకత, వాటిలో ఉన్న ఔషధ గుణాలను వివరించారు. ప్రతి ఇంటిలో లోపల తులసి వెలుపల వేపచెట్టు ఉండాలని, ఊరిలో రావి చెట్టు, ఊరి వెలుపల మరి చెట్టు ఉండాలన్నారు. పంచభూతాలను కలుషితం చేస్తే సమాజం నష్టపోతుందని, ప్రకృతిని కాపాడుకుంటూ మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు. కలుపు మొక్క వయ్యారి బొమ్మ ఎలా నివారించాలో వివరించారు. గ్రామీణ పరిశోధకులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఐఏఎస్ అధికారి తిరుపతి ఏపీఎస్ డిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి అంటే ప్రకృతి సంపద భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని సంపదంటే ఆరోగ్యమేని ఆ ఆరోగ్యం కాపాడుకోవాలంటే కలుషితం లేని ఆహారం కావాలంటే భూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతుల లో మార్పు కోసం ప్రయత్నించాలన్నారు. గ్రామీణ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేయాలని అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను గ్రామీణ శాస్త్రవేత్తల బృందం, ఎస్ సి వి దిలీప్, స్థానిక రైతు నాయకులు ఘనంగా సత్కరించారు.

