కామారెడ్డి, 1 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ (పీఏసిఎస్)ను జిల్లా వ్యవసాయ అధికారి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ (డిసిఓ) సందర్శించారు. ఎరు వుల డీలర్లు సేల్ రిజిస్టర్, స్టాక్ బోర్డులు తప్పక సరిగ్గా పెట్టాలని ఘాటైన ఆదేశాలు జారీ చేశారు. రికార్డులు సరిగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు.ఈ తనిఖీలు రైతులకు నాణ్యమైన ఎరువుల సులభ సరఫరా, పారదర్శక తను బలోపేతం చేస్తాయని చెప్పారు. పీఏసిఎస్ లు ఎరువులు, విత్తనాల పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. డీలర్లు రికార్డులు సరిగా ఉంచక పోతే బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయని అధికారులు స్పష్టం చేశారు


